పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో వహిస్తుండగా,ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2 పార్ట్స్ గ ప్లాన్ చేసిన పుష్ప చిత్రం తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏకంగా రూ.300 కోట్లు కలెక్షన్స్ను వసూలు చేసింది. వసూళ్ల పరంగానే కాకుండా బన్నీ లుక్, పాటలు, యాక్షన్..
హీరో మేనరిజమ్ ఇలా అన్నీ మంచి పాపులర్ అయ్యాయి.పుష్ప ది రైజ్ చిత్రంలో ఏకంగా సమంతనే ఐటమ్ బ్యూటీగా ఊ అంటావా మావ … అంటూ మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.
తాజాగా ఇప్పుడు పుష్ప 2లో ఐటం సాంగ్ ని మించేలా ఐటెం సాంగ్ కోసం ప్రయత్నాలు చేస్తునట్టు తెలుస్తుంది. సుకుమార్.
![ఓ ఐటెమ్ సాంగ్ కోసం పుష్ప 2 మేకర్స్ ఏకంగా రూ.7 కోట్ల?? 2 ఓ ఐటెమ్ సాంగ్ కోసం పుష్ప 2 మేకర్స్ ఏకంగా రూ.7 కోట్ల??](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/e6b9ee31-78cf-4e7a-ae15-ad0257a1af01.jpg)
పుష్ప 2 :
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ వారిదైన స్టైల్లో ఎప్పటిలాగానే ఐటమ్ సాంగ్కి అదిరిపోయే ట్యూన్ ఇచ్చేశారని, ఈ ఐటం సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. .ఈ క్రమంలో పుష్ప 2పై తాజాగా మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ ఐటెమ్ సాంగ్ చేయటానికి ఊర్వశీ రౌతేలా ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేస్తుంది అని సమాచారం . అయితే ఆమెకున్న క్రేజ్.. సినిమా పాన్ ఇండియా రేంజ్లో రానుంది కాబట్టి మేకర్స్ కూడా ఓకే చెప్పారని టాక్ వినిపిస్తుంది . ఇక ఈ ఐటం సాంగ్ సెట్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేచేస్తునట్టు తెలుస్తోంది. అంటే ఓ ఐటెమ్ సాంగ్ కోసం పుష్ప 2 మేకర్స్ ఏకంగా రూ.7 కోట్లను దారపోస్తుంది అని అర్ధం అవుతుంది