పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడికల్ లవ్ స్టోరి. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి మేకర్స్ కూడా భారీగా ప్లాన్ లు చేస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల కావాల్సిన జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా థర్డ్ వేవ్ కారణంగా.. మార్చ్ 11కి వాయిదా పడింది. దీంతో సినిమా ప్రమోషన్స్లో స్పీడును పెంచుతున్నారు మేకర్స్. అందులో భాగంగా మార్చి 2న ‘రాధే శ్యామ్’ నుంచి మరో కొత్త ట్రైలర్ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. మార్చి 2 మధ్యాహ్నం 3 గంటలకు రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ విడుదల కాబోతుంది. ఇక రేపటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ హంగామా షురూ కానుందనడంలో సందేహం లేదు