ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా వుండే రాజమౌళి తాజాగా స్క్రీన్ పై కనిపించబోతున్నారు. కానీ ఎప్పటిలాగా సినిమాలో అతిథి పాత్ర కోసం కాదు.. ఈసారి ఓ యాడ్ కోసం తెరపై కనిపించారు. ఇటీవలే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో.. అయనని తమ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుంది. అందులో ఓ న్యూ లుక్లో కనిపించారు.
ఇక అయన నటించిన ఈ యాడ్ ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో కోసం అని తెలుస్తుంది. అయితే ఈ యాడ్ కోసం రాజమౌళి మూడు కోట్ల రూపాయలను తీసుకున్నట్టు సమాచారం. ఇదే క్రమం లో సినిమాలకైతే రాజమౌళి 150 రూపాయల కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకునే అతను యాడ్ కోసం ఎంత తక్కువ తీసుకోడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. . ఈ అడ్వర్టైజ్మెంట్ రీసెంట్గ ప్రసారం అవుతుంది. అందులో చాలా స్టైలిష్ లుక్ లో కనపడ్డారు అయన. ఈ లుక్లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.