ఆర్ఆర్ఆర్ సినిమా జాపనీస్ భాషలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, తారక్ ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్ళారు. అక్కడ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. అదే సమయంలో జపాన్ లోనే పలు ప్రాంతాలలో పర్యటిస్తూ అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. వారి హంగామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గామారిపోయింది. ఆర్ఆర్ఆర్ టీమ్ తారక్, రామ్ చరణ్ కి సంబందించిన యాక్టివిటీస్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభిమానులకి అందిస్తున్నారు. తారక్ ఓ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడి ప్రేక్షకులకి జపాన్ భాషలో అభివాదం తెలియజేశాడు.
వారిని కలవడం తనకి సంతోషంగా ఉందని చెప్పారు. ఇక తారక్ జాపనీస్ భాషలో మాట్లాడేసరికి అక్కడున్న ప్రేక్షకులు అందరూ సంతోషంగా కేరింతలు కొట్టారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి టోక్యోలో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కి వెళ్లి అక్కడి విద్యార్థులతో గడిపారు. అలాగే వారితో చాలా సేపు ముచ్చటించారు. అలాగే నాటు నాటు పాటకి అక్కడి ఫ్యాన్స్ తో కలిసి స్టెప్పులు వేశారు. దోస్తీ సాంగ్ కి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఫ్యామిలీ అందరూ కలిసి స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్ ని అలరించారు.
ఇలా జపాన్ లో ఆర్ఆర్ఆర్ టీమ్ కి అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతంగా ఆదరణ లభిస్తుంది. రజినీకాంత్ ముత్తు సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో జపాన్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక తారక్, రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి అక్కడ రెస్టారెంట్స్ కి వెళ్లి జాపనీస్ స్టైల్ ఫుడ్స్ ని టేస్ట్ చేస్తున్నారు. అలాగే జపాన్ కల్చర్, ఫుడ్, ప్రజల ఆదరణ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. వీటికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.