కాంతారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సిరీస్ తర్వాత అత్యధిక కలెక్షన్ చేసిన చిత్ర దర్శకుడుగా, నటుడుగా రిషబ్ శెట్టి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కన్నడ నుంచి ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ బాషలలో డబ్బింగ్ వెర్షన్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో అయితే ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందిలో కూడా 20 కోట్ల దగ్గర కాంతారా మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా లెవల్ లో రిషబ్ శెట్టి ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా తన ప్రతిభతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే రిషబ్ పంత్ తో అల్లు అరవింద్ ఒక సినిమా చేయడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అల్లు అరవింద్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఈ మూవీలో హీరోగా ఎవరుండాలి అనేది రిషబ్ ఛాయస్ కె అల్లు అరవింద్ వదిలేసాడు. ఇదిలా ఉంటే కాంతారా సినిమా ప్రమోషన్ కి వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ ని రిషబ్ శెట్టి కలుకున్నాడని, ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ ని చెప్పాడని టాక్. ఇక చెర్రీకి రిషబ్ శెట్టి చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్.
ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించడానికి రెడీ అవుతుందని టాక్. నిర్మాతని కూడా రామ్ చరణ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక కాంతారాతో హైప్ క్రియేట్ కావడంతో రామ్ చరణ్, రిషబ్ శెట్టి కాంబినేషన్ సినిమాకి పాన్ ఇండియాలో బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. అయితే కొద్ది నెలలు విశ్రాంతి తీసుకొని తరువాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తానని రిషబ్ శెట్టి రీసెంట్ గా చెప్పాడు. ఈ నేపధ్యంలో శంకర్ తో చెర్రీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రిషబ్ శెట్టితో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్.