Rashmika Mandanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన. ఈ అమ్మడు సౌత్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే సౌత్ లో అందరికంటే ఎక్కువగాగా సంపాదించిన హీరోయిన్స్ జాబితాలో టాప్ లో ఉంది. ఒకప్పుడు సమంత హైయెస్ట్ గా సంపాదించే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఉంటే ఇప్పుడు రష్మిక మందన ఆ స్థానం సొంతం చేసుకుంది.
యాడ్స్ ద్వారానే ఈ అమ్మడు కోట్లాది రూపాయిలు ఏడాదికి సంపాదిస్తుంది. సౌత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటంతో రీజనల్ భాషలలో యాడ్స్ కోసం రష్మిక మందనని తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచి అందాల ప్రదర్శన చేయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకపోవడంతో అండార్స్మెంట్ కంపెనీలు రష్మికతో ఎక్కువ ఒప్పందాలు చేసుకుంటారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2 మూవీతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే సినిమాలే కావడంతో ఈ బ్యూటీ వాటిపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రష్మిక మందనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె పెట్టె హాట్ ఫోటోలకి విపరీతంగా ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఓ యాడ్ షూట్ కి సంబందించిన వీడియోని, ఫోటోలని షేర్ చేసింది. ఆ వీడియోని షేర్ చేసిన గంటలోనే ఏకంగా ఐదు లక్షల మందికి పైగా లైక్స్ చేయడం విశేషం. అలాగే ఆ యాడ్ కోసం చేసిన అమ్మడు ఫోటోషూట్ కూడా టెంప్ట్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.