మల్టీస్టారర్స్ చేయడానికి, మరో కథానాయకుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాస్ మహారాజా రవితేజకు అభ్యంతరం లేదు.కథ, అందులో తన పాత్ర నచ్చితే చాలు… సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. నటుడిగా, హీరోగా ప్రయాణం ప్రారంభించిన కొత్తల్లో ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు.
ఇప్పుడు మళ్ళీ మల్టీస్టారర్స్ మీద దృష్టి పెట్టారు. ‘కలర్ ఫోటో‘ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది మల్టీ హీరోస్ కథ. రవితేజతో పాటు మరో హీరోకి కూడా చోటు ఉంది. తొలుత ఆ పాత్రకు శర్వానంద్ ను అనుకున్నారు. అయితే, ఇప్పుడు శర్వా బదులు మరొక హీరో పేరు వినబడుతోంది . అది ఎవరో కాదు మాక్ కా దాస్ విశ్వక్ సేన్.
రవితేజ, విశ్వక్ సేన్ స్వతహాగా స్వయంకృషితో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోలు పైగా మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక వీరు ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే ప్రేక్షకులకు తప్పకుండా పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం మనోజ్ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సందీప్ రాజ్కు దర్శకుడిగా ఇది రెండో సినిమా కానుంది.మరి ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే.. ప్రేక్షకులకు తప్పకుండా ఒకే టికెట్పై రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.