ప్రేక్షకుల హృదయాలలో నవ్వుల రారాజుగా వెలుగొందిన అల్లు రామలింగయ్య గారి జయంతిని దృష్ఠిలో ఉంచుకొని ఈరోజు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.మంచి హిట్ కోసం గత కొద్దిరోజులుగా వెయిట్ చేస్తున్న తేజ్ ఈ మూవీపైనే హోప్స్ పెట్టుకున్నారు.ఆ హోప్స్ ను ఈ మూవీ రీచ్ అయ్యింది.ఈ మూవీలో తేజ్ యాక్టింగ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఒక పబ్లిక్ సర్వీస్ అధికారి రాజకీయ నాయకుల కుటిల పన్నాగలకు చెక్ పెట్టి రాజ్యాంగ స్ఫూర్తిని ఎలా నిలిపారు అనే కథాంశంపై తెరకెక్కిన ఈ మూవీ సమాజంలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది.ప్రజలలో ప్రస్తుతం న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందన్న విషయాన్ని దర్శకుడు దేవా కట్టా చాలా చక్కగా చూపించారు.తాత జయంతి రోజు తేజ్ మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి మూవీని అందించారు.