జీహెచ్ఎంసీ కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించగా, ఈ సందర్భంగా వివిధ శాఖల హెచ్ఓడీలు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు అభినందించారు.
వెంటనే ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ అధికారులతో రోస్ సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని, వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం, డబుల్ బెడ్రూం ఇళ్ల క్లియరెన్స్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారందరికీ ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పురోగతిని రోజువారీగా పర్యవేక్షించడమే కాకుండా వ్యక్తిగతంగా సమీక్షించాలని డిప్యూటీ కమిషనర్లను ఆయన కోరారు.
రోజ్ గతంలో మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా, గురుకుల పాఠశాల ఆర్థిక కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ అదనపు, జోనల్ కమిషనర్గా పనిచేశారు.