రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక తారక్, రామ్ చరణ్ లని ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేసింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇండియా నుంచి మొదటి ఆస్కార్ తెచ్చుకునే సత్తా ఆర్ఆర్ఆర్ కి ఉందని బాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగిపోయింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటికి ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకి బుల్లితెర మీద మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా స్టార్ మాలో ఈ మూవీ టెలికాస్ట్ అయ్యింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమాకి టెలివిజన్ ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కేవలం 19.62 రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజంగా ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీకి ఇది తక్కువ రేటింగ్ అని చెప్పాలి. ఇక టెలివిజన్ లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న చిత్రంగా అల వైకుంఠపురంలో సినిమా ఉంది. ఈ సినిమాకి అత్యధికంగా29.4 రేటింగ్ రావడం విశేషం.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి రేటింగ్ తగ్గడానికి కారణాలు ఉన్నాయి. ఈ సినిమాని మెజారిటీ ఆడియన్స్ థియేటర్స్ లో అలాగే ఓటీటీలో చూసేసారు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఓటీటీ చానల్స్ కూడా భాగం అయిపోయాయి. దీంతో ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే సినిమాని చూసేస్తున్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ఓటీటీలు అంతగా ప్రాచూర్యంలోకి రాలేదు. ఈ నేపధ్యంలో అక్కడ మాత్రమే టీవీలలో ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు. ఈ కారణంగానే రేటింగ్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు.