బ్రో సినిమా గురించి హీరో సాయి ధరమ్ తేజ్ కీలక అప్డేట్ తెలిపాడు. షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో మూవీ కోసం అభిమానులు వేచిచూస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత మామాఅల్లుళ్లు కలిసి చేస్తున్న ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కల్యాణ్ వివిధ గెటప్ల్లో కనిపిస్తాడని టీజర్లో చూపించటంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ బ్రో చిత్రం జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో సాయి ధరమ్ తేజ్ కీలక అప్డేట్ వెల్లడించాడు.
![బ్రో మూవీపై కీలక అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ 2 బ్రో మూవీపై కీలక అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-05T152630.643.jpg)
బ్రో సినిమా షూటింగ్ పూర్తయినట్టు సాయి ధరమ్ తేజ్ కన్ఫర్మ్ చేశాడు. ఈ మేరకు నేడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. “బ్రో షూటింగ్ పూర్తయింది. ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశమైన ఇన్స్బక్స్లో షూటింగ్ తుది దశ ముగిసింది. అద్భుతమైన షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ యూనిట్కు చాలా కృతజ్ఞతలు” అని సాయి ధరమ్ తేజా ఇన్స్టాగ్రామ్లో రైటప్ పోస్ట్ చేశాడు. అక్కడ క్రూ మెంబర్లతో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు.