Samantha ఇప్పుడంతా మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు ఒకే స్క్రీన్పై మెరుస్తూ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేస్తున్నారు. అయితే హీరోల సంగతి అటుంచితే స్టార్ హీరోయిన్లు కూడా ఒకే తెరమీద నటించడానికి రెడీ అవుతున్నారు.
స్టార్ హీరో లేదా హీరోయిన్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అంచనాలు ఓ లెవల్లో ఉంటాయి. అదే ఇద్దరు స్టార్లు ఒకే మూవీలో నటిస్తే ఆ కిక్కే వేరు. తాజాగా హీరోయిన్లు అనుష్క, సమంత ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది ప్రారంభమైంది. మహాభారతంలోని ద్వితీయాశ్వాసంలోని శకుంతల , దుష్యంతుల ప్రణయ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
సినిమాను అభిమానుల అంచనాలకు తగ్గట్టే గ్రాండ్గా రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ సమంత ఫస్ట్ లుక్ ఒకటే విడుదల అయింది. సమంత వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో ఈ షెడ్యూల్ కాస్త లేటయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. సమంత సినిమాలో అనుష్క కూడా నటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఒకే వేదికపై చూసుకోవచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు. పైగా వీరిద్దరూ ఇంతవరకు ఏమూవీలో నటించలేదు కూడా. అయితే ఈ విషయంపై మూవీ యూనిట్ వేగంగానే స్పందించింది.
సినిమా నిర్మాత నీలిమా గుణ స్పందించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. సినిమాలో అనుష్క నటించడం లేదని ఓ నెటిజన అడిగిన ప్రశ్నకు బదులిస్తూ క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. శాకుంతలం సినిమాలో అనుష్క నటిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. దీంతో అనుష్క, సమంతను ఒకే స్క్రీన్పై చూస్తామనుకున్న అభిమానులు నిరాశలో పడిపోయారు. మొత్తానికి శాకుంతలం సినిమా టీజర్ త్వరలోనే చూస్తామని కూడా నిర్మాత పోస్టింగ్ను బట్టి తెలుస్తోంది.