సమంత పోస్ట్ వైరల్
సమంత ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా తాజాగా నటిస్తున్నసినిమా ఖుషి.. సెప్టెంబర్ 1వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ సినిమాకి శివానిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ అన్నీ కూడా భారీ అంచనాలను పెంచేసాయి.
![ఒంటరి జీవితం పై సమంత పోస్ట్ వైరల్..పాపం ..! 2 ఒంటరి జీవితం పై సమంత పోస్ట్ వైరల్..పాపం ..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-24T113718.834.jpg)
ముఖ్యంగా సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీని తెరపై చూడడానికి అభిమానులు సైతం ఆసక్తిగా ఎంతో ఎదురుచూస్తున్నారు. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతుంటే.. మరొకవైపు సమంతా మాత్రం న్యూయార్క్ వీధుల్లో అభిమానులతో మంచిగా ముచ్చటిస్తున్నారు. అక్కడ ఇండిపెండెన్స్ డే పరేడ్లో పాల్గొనడానికి వెళ్లిన సమంత .. తన మొదటి మూవీ షూటింగ్స్ సందర్భంగా న్యూయార్క్ వచ్చానని.. మళ్లీ 14 యేళ్ళ తర్వాత అదే ప్రదేశానికి వచ్చాను అని అంటూ సమంత తాజాగా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో మళ్ళీ ఒక పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది .
” మీకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లే అవకాశం వచ్చినా లేదా నడిచే అవకాశం వచ్చినా.. ఆఖరికి ప్రయాణించే అవకాశం వచ్చినా. . డాన్స్ చేసే అవకాశం వచ్చినా.. బ్రతికే అవకాశం వచ్చినా అమీ వచ్చిన చేసేయండి.. ఈ సమాజం నిన్ను నిన్నులా ఒప్పుకోకపోతే అలాగే ఒంటరిగానే ప్రయాణించాలి.. నిన్ను నువ్వు అన్వేషించుకో పక్కన ఎవరైనా ఉన్నప్పుడే తన గురించి తాను తెలుసుకుంటారు. కానీ మీరు కూడా అదే కేటగిరీలో ఉండిపోకండి కానీ మీకు ఒంటరిగా నడిచే బతికే అవకాశం వస్తే.. మాత్రం బ్రతికేయండి.. అప్పుడే జీవితం అంటే ఏంటో మీకు అర్థం బాగా అవుతుంది.. అలాగే తెలుస్తుంది.. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు” అని అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే సమంత చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.