ఏ మాయ చేసావె’ను గుర్తుచేసుకుంటూ సమంత పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో చాలా బాధ పడుతున్న విషయం మనకి తెలిసిందే. ఈ వ్యాధికి సామ్ చికిత్స కూడా తీసుకుంటుంది అని తెలుసు . అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్తోందనే ప్రచారం బాగా వినిపిస్తుంది .
![ఏ మాయ చేసావె’ను గుర్తుచేసుకుంటూ సమంత పోస్ట్ 2 ఏ మాయ చేసావె’ను గుర్తుచేసుకుంటూ సమంత పోస్ట్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-22T110427.619.jpg)
అయితే.. ప్రస్తుతం న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ లో పాల్గొన్న సమంత…’ఏ మాయ చేసావే’ సినిమా ని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది . ‘నా తొలి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. అప్పుడు కెరీర్ ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్న పిల్లను నేను. గొప్ప కలలతో ధైర్యంగా ముందడుగు వేశాను . 14 ఏళ్ల తర్వాత ఇండిపెండెన్స్ డే పరేడ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని రాసుకోచ్చారు. ఈ సినిమా లో నాగచైతన్య, సమంత నటించిన విషయం మనకు తెలిసిందే.