అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే. ఈ బ్యూటీ హీరోయిన్ కావాలనే డ్రీమ్ తో ఇంట్లో నుంచి బయటకి వచ్చేసి ఎన్నో కష్టాలు పడి అర్జున్ రెడ్డి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో షాలిని పాండేకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో షాలిని నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. తరువాత మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం అనే సినిమాలలో ఆమె నటించింది. ఇక తమిళ్ లో 100% లవ్ రీమేక్ మూవీలో జీవీ ప్రకాష్ రావుతో జతకట్టింది. అయితే ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగులో కూడా అర్జున్ రెడ్డి తర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
ఇక హిందీలో రణబీర్ కపూర్ కి జోడీగా అవకాశం రావడంతో షాలిని పాండే ముంబై చెక్కేసింది. మొదటి సినిమా జయభేరి జోర్దార్ సినిమా టైటిల్ తో వచ్చింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మహారాజా అనే మూవీలో ఈ బ్యూటీ నటిస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ ని అందుకుంది. అయితే ఈ మూవీలో ఆమె పోషించే పాత్ర చాలెంజింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. డబ్బున్న వారి దగ్గరకి అమ్మాయిలని పంపించే ఫీమేల్ బ్రోకర్ పాత్రలో షాలిని పాండే ఈ మూవీలో కనిపించబోతుందని తెలుస్తుంది.
అయితే నటనకి బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో షాలిని పాండే ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. మరో వైపు డిజిటల్ ఎంట్రీ కూడా ఈ బ్యూటీ ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగులో అర్జున్ రెడ్డి లాంటి సక్సెస్ తర్వాత కూడా షాలిని పాండేకి సరైన ఆఫర్స్ రాకపోవడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి. అలాగే కెరియర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం కూడా షాలిని పాండే ఫెయిల్యూర్ కి కారణం అనే మాట వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉండటంతో బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలని షాలిని పాండే సొంతం చేసుకుంది.