శ్రియా భర్త ఆండ్రూ కొశ్చివ్ హెర్నియాతో బాధపడుతున్నాడని సమాచారం. రెండు నెలల క్రితం తమ పాప రాధను కూడా ఎత్తుకునే స్థితిలో లేడని శ్రియా చెప్పింది. అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చేసిన సర్జరీ సక్సెస్ అయిందని, హాస్పిటల్ యాజమాన్యానికి, ఉపాసనకు ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలిపింది. అంతా మంచే జరిగింది కదా? అది చాలు అన్నట్టుగా ఉపాసన రిప్లై చేసింది.
ఈ మేరకు శ్రియా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మామూలుగానే శ్రియా రోజూ పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక తన భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ పిక్స్ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అవన్నీ పాత ఫోటోలే అని తాజాగా చేసిన పోస్ట్తో తెలిసింది. ఆండ్రూ ఆస్పత్రిలో ఉంటే శ్రియాతో అలా రొమాంటిక్గా ఉండటం ఎలా అవుతుంది. తన కూతురు రాధను కూడా ఎత్తుకోలేని స్థితిలోకి ఆండ్రూ చేరడంతో ఆ వ్యాధి ఏంటని అనుకుంటున్నారు. హెర్నియా అనే వ్యాధి కడుపుకు సంబంధించినది. హెర్నియా అనే వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆండ్రూ మాత్రం మామూలు స్థితికే వచ్చేశాడు.
తన భర్తకు ఆ వ్యాధి నయం కావడంతో శ్రియా ఫుల్ ఖుషీ గా ఉంది. తన భర్తను బాగా ట్రీట్ చేసిన అపోలో యాజమాన్యానికి, ఉపాసనకు శ్రియా స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. అంతా మంచే జరిగినందుకు నాకు సంతోషంగా ఉందని అంటూ ఉపాసన రిప్లై ఇచ్చింది.