గోదావరిఖని 11 (ఎ) ఇంక్లైన్ బొగ్గు గనిలో గురువారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.
భూగర్భ గని సైడ్వాల్ కూలి అతనిపై పడడంతో తీవ్ర గాయాలపాలైన బక్క కృష్ణమురారి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. కృష్ణమురారి స్వస్థలం హన్మకొండ జిల్లా మడికొండ. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
- Read more News