తెలుగులో డబ్బింగ్ సినిమాలతో చాలా మంది ప్రేక్షకుల ముందుకి వచ్చి హాట్స్ సొంతం చేసుకున్నారు. చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్స్ చాలా మంది సక్సెస్ అయ్యారు. అయితే వీరిలో ఎవరికీ కూడా మొదటి సినిమాతోనో, లేదంటే రెండో సినిమాతో సక్సెస్ రాలేదు. సుదీర్ఘ కాలం పాటు తమ సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకి చేరువ కావడంతో తెలుగు హీరోలతో సమానమైన ఫాన్స్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అయితే వీరిలో ఒక్క రజినీకాంత్ తప్ప ఏ ఒక్కరు కూడా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ ని తెలుగులో సొంతం చేసుకోలేదు.
అయితే ఆ ఘనత మాత్రం ఇప్పుడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ కి దక్కింది. మలయాళీ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టికి కూడా సాధ్యం కానీ రికార్డ్ ని దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నాడు. సీతారామం సినిమాతో దుల్కర్ స్ట్రైట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. క్లాసికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. హను రాఘవపూడి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా తాజాగా ఏకంగా 75 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తెలుగులో ఇంత ముందు దుల్కర్ మహానటి సినిమా మాత్రమే ఉంది.
అలాంటి హీరో ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇతర బాష హీరోలలో ఒక్క రజినీకాంత్ కి తప్ప ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ ని దుల్కర్ సీతారామం సినిమాతో సొంతం చేసుకున్నాడు. ఇదే స్పీడ్ తో మలయాళంలో దుల్కర్ నటించిన హిట్ మూవీలు వరుసగా తెలుగులోకి డబ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా మంది టాలీవుడ్ దర్శకులు దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చే నెలలో హిందీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మరి నార్త్ ఇండియన్ ప్రేక్షకులని సీతారామం ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.