మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇప్పుడు ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.తమిళ్ సినిమా ‘వేదాళం’కు రీమేక్ గా రూపొందుతోంది ఈ చిత్రం. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని దర్శకుడు తెలిపారు.
![‘భోళాశంకర్’ నుంచి సాలిడ్ అప్ డేట్.. 2 ‘భోళాశంకర్’ నుంచి సాలిడ్ అప్ డేట్..](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/7623f484-acd2-4b1a-900f-5367ee303d14.jpg)
కాగా షూటింగ్ ముగిసిన అనంతరం మెహర్ రమేష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీం మొత్తం విశ్రాంతి అనేది లేకుండా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేశామని తెలిపారు.సినిమాకు కీలకం అయిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే పాటలకు సంబంధించిన అప్డేట్ ఇస్తామని డైరెక్టర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన స్పెషల్ ట్వీట్ కూడా చేశారు.
షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫోటోలని పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీవుతోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్ర పోషించింది. అక్కినేని సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు అయితే ఆయన, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.