ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల కార్యకర్తలు బుధవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేవని ఆరోపిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ పోస్టులను ఖాళీగా ఉంచుతోందని ఆరోపించారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పీడీఎస్యూ రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.