T20 World Cup 2022: ఈ T20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ పోటీలలో సూపర్ -12 పోరుకు అర్హత సాధించడానికి 8 జట్లు తమ పోరును ఆరంభించాయి. ఇందులో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధించగా మరో నాలుగు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వీటిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, నమీబియా, UAE జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి. జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు సూపర్ -12 పోటీలకు అర్హత సాధించాయి.
ఈ సూపర్ -12 పోరులో ఏ జట్టును తక్కువగా అంచనా వేయలేము. తమ రోజంటూ ఉంటే చిన్న జట్లు కూడా పెద్ద జట్లను ఓడించగలవు. ఈ సూపర్-12 పోటీలలో తమ మొదటి మ్యాచ్ ను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ప్రారంభం కానున్నది. తర్వాత ఇదే రోజు 4:30 నిమిషాలకు ఆఫ్గనిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య రెండో మ్యాచ్ ప్రారంభం కానున్నది. దీంతో క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే రేపు జరగబోయే మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ జట్టుతో ఆడనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ ఫ్యాన్స్ కు ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ 12 పోటీలలో ప్రతి జట్టు వివిధ జట్లపై ఐదు మ్యాచులు ఆడనుంది. ఇందులో మెరుగ్గా రాణించిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. కానీ సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే ప్రతి జట్టు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది.
T20 World Cup 2022:
ఈ సూపర్- 12 పోటీలు నేటి నుండి ప్రారంభమై నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పోటీలలో భాగంగా ప్రతిరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సగటు క్రికెట్ అభిమాని టీవీలకు అతుక్కుపోయేలా ఈ మ్యాచ్లు కొనసాగనున్నాయి. ఏది ఏమైనా అందరి చూపు చిరకాల ప్రత్యర్ధులైన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉంది.