T20 World Cup 2022: అక్టోబర్ 16న ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 21 వరకు క్వాలిఫయర్ పోటీలు జరిగాయి. వీటిలో పేరున్న జట్లు వెస్టిండీస్, శ్రీలంక జట్లు కూడా పాల్గొన్నాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు పేలవ ప్రదర్శనతో ఇంటి ముఖం పట్టగా, శ్రీలంక జట్టు ముందుకు దూసుకువెళ్లింది. నేటి నుండి జరిగే సూపర్ 12 పోటీలకు శ్రీలంక, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు అర్హత సాధించాయి. స్కాట్లాండ్, వెస్టిండీస్, నమీబియా, యూఏఈ జట్లు ఇంటి ముఖం పట్టాయి.
ప్రారంభంలో క్వాలిఫయర్ పోటీలలో వెస్టిండీస్ జట్టుకు ఊహించని రీతిలో స్కాట్లాండ్ జట్టు షాక్ నిచ్చింది. అలాగే నమీబియా జట్టు శ్రీలంక జట్టుకు షాక్ నిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇవే పెద్ద రికార్డులుగా చెప్పుకోవచ్చు. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే ఏ జట్టుకైనా సవాల్ విసురుతోంది. సూపర్- 12 పోటీలలో ఐర్లాండ్ జట్టు తమ ప్రత్యర్థులపై విరుచుకు పడడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా నెదర్లాండ్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో సూపర్-12 పోటీలకు అర్హత సాధించింది.
శ్రీలంక జట్టు నమీబియా జట్టుపై ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో శ్రీలంక పని అయిపోయిందని అందరూ భావించారు. తర్వాత తిరిగి పుంజుకున్న శ్రీలంక జట్టు యూఏఈ, నెదర్లాండ్స్ జట్లపై వరుస విజయాలు సాధించి సూపర్-12 పోటీలకు అర్హత సాధించింది. శ్రీలంక జట్టు సూపర్ -12లో వివిధ జట్లతో 5 మ్యాచుల్లో తలపడనుంది.
T20 World Cup 2022:
ఇక జింబాబ్వే జట్టులో కొందరు ఆటగాళ్లు నిలకడగా రాణించడంతో సూపర్-12 పోరుకు అర్హత సాధించింది. చూడడానికి చిన్న జట్టు అయినా తమ రోజంటూ ఉంటే పెద్ద జట్లకు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సూపర్ -12 పోరులో భాగంగా జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు ఇండియా జట్టుపై ఆడనున్నాయి. ఈ వరల్డ్ కప్ పోరులో భాగంగా ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో, ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో వేచి చూడాలి మరి!