నందమూరి తారకరత్న గుండెపోటుతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఏకంగా ఏక్మో ట్రీట్మెంట్ కి చేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ కి తారక్ హార్ట్ సహకరించినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు పూర్తిగా మెషిన్స్ సహాయంతోనే అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగుళూరులో నారాయణ హృదయాలని అతనికి అత్యాదునాతన వైద్యం అందుతుంది. ఎప్పటికప్పుడు బాలకృష్ణ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లతో మాట్లాడుతూ సిచువేషన్ ని తెలుసుకుంటున్నారు. అలాగే తారక్ కండిషన్ పై హెల్త్ అప్డేట్స్ కూడా బాలయ్య బాబు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే తారకరత్న హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుందని బాలకృష్ణ మీడియాతో తెలియజేశారు. అద్బుతం జరిగిందని, పూర్తిగా ఆగిపోయిన గుండె మరల ప్రస్తుతం కొట్టుకుంటుంది అని తెలిపారు. చికిత్సకి కూడా అతని శరీరం సహకరిస్తున్నారని, కాస్తా మెలుకువలోకి వచ్చినట్లుబాలకృష్ణ చెప్పారు. కుప్పంలో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించినా కూడా వారి సూచనలతో నారాయణకి తీసుకొచ్చామని తెలిపారు. అత్యాదునాతన వైద్యం డాక్టర్లు అందిస్తున్నారని అన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసిపోయి కలివిడిగా తిరిగే తారక్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండటం బాధాకరమైన అందరి ఆశ్వీర్వాదాలు, పూజలతో మళ్ళీ అతను కోలుకొని మన మధ్యకి వస్తాడని బాలయ్య తెలిపారు.
అంతర్గత రక్తస్రావం కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక తారకరత్నని ఆదివారం నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బెంగుళూరుకి వెళ్లి తారక్ పరిస్థితిని చూసారు. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాస్పిటల్ కి వచ్చి డాక్టర్లతో మాట్లాడించారు. అదే సమయంలో కర్ణాటక పోలీసులు కూడా నందమూరి కుటుంబ సభ్యుల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం విశేషం. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.