కుప్పం నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే బెంగుళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి అత్యవసర చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్లు నిరంతర పర్యవేక్షణలో తారకరత్నకి వైద్యం అందుతుంది. ఇక ఐసీయూలోనే ట్రీట్మెంట్ స్టేజ్ లోనే అతని శరీరం ఉంది. సాధారణ కదలికలు లేవని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి కాస్తా విషమంగానే ఉందని ఇప్పటికే హెల్త్ అప్డేట్ ఇచ్చారు. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్యంపై మరో న్యూస్ బయటకి వచ్చింది.
తారక్ అరుదైన మెలెనా వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యాధి సోకినా వారికి జీర్ణాశయంతర రక్తస్రావం ఉంటుంది. జీర్ణాశయ మార్గంతో పటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగంలో రక్తస్రావం అవుతుంది. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడంలో వలన, కడుపులో పుండ్లు, వాపు, రక్తసంబందిత అనారోగ్య సమస్యల కారణంగా ఈ మెలెనా వ్యాధి బారిన పడతారు. ఇక ఈ వ్యాధి కారణంగా మలం నల్లగా, బంక మాదిరిగా బయటకి వస్తుంది.
అధిక రాస్తశ్రావం కారణం, రక్తస్తాయి తగ్గిపోతుంది. ఒక్కోసారి శ్వాస సంబందిత సమస్యలు వస్తాయి. శరీరం రంగు మారిపోవడం, విపరీతమైన అలసట, చెమటలు పట్టి, ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకొని హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది. దీనికోసం ఎక్మో మెషిన్ ఇంప్లాటేషన్, ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, రక్తమార్పిడి చికిత్సలు చేస్తారు.
ప్రస్తుతం మరింత అడ్వాన్స్ లెవల్ అయిన బెలూన్ యాంజియో ప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షణక్షణం అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అని అయితే తమ ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తున్నట్లు వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు తారకరత్న కుటుంబ సభ్యులు అందరూ కూడా బెంగుళూరు హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. మరోవైపు ఆయన వేగంగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కూడా పూజలు చేస్తున్నారు.