ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రలతో సాయి రాజేష్ దర్శకత్వం లో విడుదలైన చిత్రం బేబీ . అనుకున్న దాని కంటే ఘన విజయం సాధించడం తో మెగా ఈవెంట్ పేరుతో విజయోత్సవ సభ హైదరాబాద్ లో జరిగింది. ఇటీవల కాలంలో విడుదలైన తెలుగు సినిమాలలో, చాలా వేగంగా భారీ వసూళ్లను సాధించిన సినిమాలలో ‘బేబి’ ఒకటిగా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో నిర్మితమై, స్టార్ హీరోల సినిమాలతో సమానంగా పరుగులు తీసిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా వైష్ణవి చైతన్య నటనకి ఎక్కువ మార్కులు వేశారు. గతంలో జరిగిన ఈవెంట్స్ లో అల్లు అరవింద్ .. అల్లు అర్జున్ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు.
![‘బేబి’ ఫీలింగ్ మూడు రోజులు వెంటాడింది: చిరంజీవి 2 ‘బేబి’ ఫీలింగ్ మూడు రోజులు వెంటాడింది: చిరంజీవి](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-31T111624.393.jpg)
మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా విజయోత్సవ వేడుక ను ‘మెగా కల్ట్ సెలబ్రేషన్స్’ పేరుతో నిర్వహించారు. ఈ వేదికపై ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరిని చిరంజీవి ఎంతగానో అభినందించారు. ఈ సినిమా దర్శక నిర్మాతలను .. హీరోలుగా నటించిన ఆనంద్ దేవరకొండను .. విరాజ్ ను మెచ్చుకుంటూనే, వైష్ణవి చైతన్య నటనను ప్రశంసించారు.