Bengaluru Doctor Dead: సోషల్ మీడియా పరిచయాలు ముందు సరదాగా ఉన్నాగాని చివర ఆఖరికి ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితులను తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ మాయలో పడి ఎవరికి వారు తమ నగ్న చిత్రాలను షేర్ చేయడం అవి బయటపడటంతో.. తమ పరువును కాపాడుకోవడం కోసం ఎదుటి వ్యక్తిని చంపేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి ఘటనలు భార్యాభర్తల మధ్య ఇంకా ప్రేమికుల మధ్య అదే రీతిలో స్నేహితుల మధ్య కూడా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే తరహాలో ఇప్పుడు బెంగళూరులో ఒక ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బెంగళూరులో బేగురు పరిధిలో ప్రతిభ(26) అనే అమ్మాయిని వికాస్(27) అనే అబ్బాయి ప్రేమించటం జరిగింది. వికాస్ ఉక్రెయిన్ లో.. డాక్టర్ చదువుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రతిభ పరిచయమయ్యింది.
ఉక్రెయిన్ లో పరిస్థితులు బాగోలేక ఆరు నెలల క్రితం ఇండియాకి వచ్చేసిన వికాస్ చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైక్రో లేవుట్ వద్ద నివాసం ఉంటున్నాడు. ఒక ఆర్కిటెక్ కంపెనీలో పనిచేస్తున్న ప్రతిభతో వికాస్ రెండు సంవత్సరాల క్రితమే పరిచయం పెంచుకోవడం అది ప్రేమగా మారటం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ కూడా డిసైడ్ అయ్యి విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పడం జరిగింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ప్రతిభా నగ్న చిత్రాలను వికాస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆమె కంటతడి పెట్టుకుంది. కుటుంబం దగ్గర తన పరువు ప్రియుడు వికాస్ తీసేయడంతో..డాక్టర్ ప్రియుడు వికాస్ పై ప్రతిభ కక్ష పెంచుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని.. తోటి స్నేహితులు.. సుశీల్, గౌతమ్, సూర్యాకి చెప్పుకుంది. దీంతో ఎట్లాగైనా వాడికి బుద్ధి చెప్పాలని వికాస్ మీద స్కెచ్ వేసి వారం రోజుల క్రితం.. అతని గదికి వెళ్లి చితకబాదారు. ఆ తర్వాత ఈ నాలుగురు అతన్ని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కోమా లోకి వెళ్లిపోయిన… బాధితుడు ఆదివారం రాత్రి చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుశీల్, గౌతం ఇంకా ప్రతిభాను అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నారు. సూర్యను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలింపు చేపట్టారు.