షూటింగ్స్ మధ్య కాస్త గ్యాప్ దొరికినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుటుంబంతో విహారానికి చెక్కేస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి లండన్లో విహారయాత్రకు వెళ్లారు. అక్కడ తన కుటుంబం , స్నేహితుల తో కలిసి ఓ రెస్టారంట్లో డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమత్రా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘లండన్ కాలింగ్’ అని క్యాప్షన్ పెట్టారు
ఈ ఫొటోలు పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్గా మారాయి.
![నమత్రా ‘లండన్ కాలింగ్’ అని పోస్ట్ వైరల్ 2 నమత్రా ‘లండన్ కాలింగ్’ అని పోస్ట్ వైరల్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-25T153542.629.jpg)
ఈ ఫొటోల్లో మహేశ్ ఎల్లో కలర్ టీ షర్ట్లో పదహారేళ్ల యంగ్ బాయ్గా కనిపించారు. రోజురోజుకు మహేశ్ మరింత అందంగా తయారవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏం తింటున్నావ్ అన్నా.. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావ్ అంటూ కుర్రాళ్లు ఈ సూపర్ స్టార్ బ్యూటీ సీక్రెట్ అడిగేస్తున్నారు.
ఇక మహేశ్ సినిమాల గురించి వస్తే తాజాగా త్రివిక్రమ్తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.