ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ సమీపంలోని హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో 10:15 గంటలకు వరంగల్లోని మామునూరుకు వెళతారు.
రూ.6100 కోట్లకి పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వరంగల్ బయలుదేరారు. ఈ పనులు హైవేల నుండి రైల్వేల వరకు వివిధ రంగాలను కవర్ చేస్తాయి. వాటి వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది.
— నరేంద్ర మోదీ (@narendramodi) జూలై 8, 2023
షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10:45 నుండి 11:20 గంటల మధ్య కోచ్ ఫ్యాక్టరీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:45 నుంచి 12:20 గంటల మధ్య వరంగల్లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం విమానంలో హైదరాబాద్కు వెళ్లి మధ్యాహ్నం 1:10 గంటలకు హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తన ప్రత్యేక విమానంలో రాజస్థాన్కు బయలుదేరుతారు.