రమేష్ తమిళమణి దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారేజ్’ జూలై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎంఎస్ ధోని నిర్మించిన ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా మరియు యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు.
హరీష్ కళ్యాణ్, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన ఎంటర్టైన్మెంట్ డ్రామా ‘లెట్స్ గెట్ మ్యారేజ్‘ జూలై 28న థియేటర్లలో విడుదల కానుంది. రెండ్రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ను క్రికెటర్ ఎంఎస్ ధోని అతని భార్య సాక్షి అగర్వాల్తో కలిసి చెన్నైలో విడుదల చేయగా, దానికి మంచి స్పందన లభించింది. నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
![ధోని ప్రొడ్యూస్ చేసిన 'లెట్స్ గెట్ మ్యారేజ్' విడుదల తేదీ వచ్చేసింది..! 2 ధోని ప్రొడ్యూస్ చేసిన 'లెట్స్ గెట్ మ్యారేజ్' విడుదల తేదీ వచ్చేసింది..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-20T135453.855.jpg)
ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ గెట్ మ్యారేడ్’ తమిళ చిత్ర పరిశ్రమలో సినీ నిర్మాతగా తన ఎంట్రీ చేస్తూ MS ధోని తన హోమ్ బ్యానర్పై నిర్మించాడు. రమేష్ తమిళమణి దర్శకత్వం మరియు సంగీతం అందించిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు, RJ విజయ్, శ్రీనాథ్, VTV గణేష్, వినోదిని, దీపా శంకర్, మరియు విక్కల్ విక్రమ్ తదితరులు నటించారు.