హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంతలు జంటగా నటించిన అప్ కింగ్ సెన్సషనల్ లవ్ స్టోరీ ఖుషి తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో ఆ పనుల్లో చిత్ర బృందం చాలా బిజీ గా ఉంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకు వెళ్లాయి అని చెప్పాలి. ఈ రెండు పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి. కాగా ఇటీవల విడుదలైన ఆరాధ్య సాంగ్ ద్వారా ఈ సినిమాలో విజయ్ మరియు సమంతల మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉండనుంది అని చూపించారు. కాగా శివ నిర్వాణ దర్శకత్వం ప్రేమకథలను తెరకెక్కించడంలో ప్రత్యేక పంథా ఉంది.
![షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషీ మూవీ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషీ మూవీ](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-89.jpg)
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. విజయ్ దేవర కొండ కి మరియు సమంత లకు ఈ సినిమా విజయం కీలకం గా మారుతుంది . మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ ను అందుకుంటాడా ? లేదా ? అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండక తప్పదు .