ఎనర్టిటిక్ హీరో రామ్, కృతి శెట్టి కాంబినేషన్ లో లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది వారియర్. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన మూవీ మొదటి రోజు పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకొని రామ్ కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ రికార్డుని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ 43 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తుంది. సుమారు ఏడువందల స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయ్యిది. హీరో రామ్ ని మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులు చూడటంతో కాస్తా ఆసక్తికరంగానే మారింది. రామ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన శాటిలైట్ హక్కులని స్టార్ మా దక్కిచుకుంది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు రిలీజ్ అయినా మరుసటి రోజు నుంచే ఓటీటీ రిలీజ్ పై చర్చలు మొదలవుతున్నాయి. కొన్ని సినిమాలని ఓటీటీ చానల్స్ ముందుగానే కొనుగోలు చేసేస్తున్నాయి. థియేటర్ లో సినిమాకి వచ్చిన టాక్ బట్టి ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటున్నాయి. మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ సినిమా విషయంలో కూడాఅలాంటి టాక్ నడుస్తుంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఛానల్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దక్కించుకుంది అని తెలుస్తుంది.
అయితే నిర్మాతలతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత ఓటీటీ లో టెలికాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఒక వేళ సినిమాకి డివైడ్ టాక్ వచ్చి కలెక్షన్స్ డ్రాప్ అయితే ఓటీటీ స్ట్రీమింగ్ వేగం కావచ్చు అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో థియేటర్ లో సినిమా టికెట్ రేట్లు ఏక్కువ కావడంతో ఫామిలీ ఆడియన్స్ ఓటీటీలో కొత్త సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది మారి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.