ఈ కొత్త దశ చాలా అద్భుతం.. సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తన సినిమాలను ప్రమోట్ చేయడమే కాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటునె ఉన్నారు . సమంత సినిమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ గత రెండు నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో తేగా వైరల్ అవుతున్నాయి.
![ఈ కొత్త దశ చాలా అద్భుతం.. సమంత కామెంట్స్ వైరల్..! 2 ఈ కొత్త దశ చాలా అద్భుతం.. సమంత కామెంట్స్ వైరల్..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T125924.081.jpg)
సమంత నటించిన ఖుషీ సినిమా ప్రమోషన్లకు కాస్త దూరంగానే ఉంటూ అమెరికాలో ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి సమంత ఇక్కడే మయోసైటిస్ వ్యాధి కి ట్రీట్ మెంట్ కూడా తీసుకోబోతున్నారనే .. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సమంత ఇప్పటివరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. సమంత సినీ ఇండస్ట్రీకి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారనే విషయం తొలిసారి ఇప్పుడు సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తాను 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వలేదని ఆమె తెలిపారు. తాను 13 ఏళ్లుగా కష్టపడుతూ ఎలాంటి విరామం లేకుండా పని చేసానని .. తొలిసారి సినిమాలకు బ్రేక్ తీసుకున్నానని కూడా తెలిపారు. ప్రస్తుతం నేను ఒక కొత్త దశని అనుభవిస్తున్నాను. ఈ దశలో నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నాను. ఈ దశ కొత్తగా ఉండటమే కాకుండా నా జీవితంలో నేను ఎంతో ఖుషిగా ఉన్నానంటూ.. సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఖుషీ సినిమా తొలుత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇప్పుడు మాత్రం సమంత ఈ ప్రమోషన్లకు చాలా దూరంగా అమెరికాలో ఉంటున్నారు.