టాలీవుడ్ స్టార్ హీరో లలో ఉదయ్ కిరణ్ ఒకరు . వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో మెగాస్టార్ రేంజ్ లో వరుసగా సినిమాలతో దూసుకుపోయే వాళ్లలో ఒకరు ఉదయ్ కిరణ్. అలాంటి సమయంలో మనసంతా నువ్వే అనే సినిమాతో మరో బంపర్ విజయాన్ని అందుకొని… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. ఈ మనసంతా నువ్వే సినిమాకు అప్పట్లో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .
ఇక ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ కి హీరోగా నటించిన రీమాసేను హీరోయిన్ గా సినిమా లో అదరగొట్టింది. 2001 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను మొదటగా మహేష్ బాబుతో చేయాలని నిర్మాత ఎమ్మెస్ రాజు అనుకున్నారట. కానీ చివరికి… ఈ సినిమా ఉదయ్ కిరణ్ చేతిలోకి వెళ్ళింది మంచి పేరు సంపాదించింది .
దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు వీఏన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమాకు ఒక యంగ్ హీరో కావాలని… అందుకే మహేష్ బాబుని పక్కకు పెట్టారు ఆదిత్య. దీనికి ఎంఎస్ రాజు కూడా ఒప్పుకొని… ఈ సినిమాకు మనసంతా నువ్వే అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇలా మహేష్ బాబు ఓ మంచి సినిమాలు మిస్ అయ్యాడు. కాగా, ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు.