బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి మళ్ళీ బ్యాడ్ న్యూస్. బంగారం రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర ఒక్క రోజులోనే ఎక్కువగా పెరిగింది. పసిడి ధర దూసుకుపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో వెళుతుంది. వెండి కూడా పైపైకి పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు మిశ్రమంగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం బంగారం ధర పెరిగింది. . 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.720 మేర పెరిగి పసిడి రేటు రూ. 51,280కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో రూ.660 పెరిగి రూ. 47,000కు చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు రూ.900 పెరుగుదలతో రూ. 69,900కు ఎగసింది.