స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ హెచ్చరిక
హైదరాబాద్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపూ ఉదయం గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయా జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలుచోట్లా ట్రాఫిక్ ఆంక్షలు మారియు మూడెంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. మరియు గోల్కొండ కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేసారు.
![స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ 2 ట్రాఫిక్ ఆంక్షలు](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/traffic-.png)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను నిర్ణీతా ప్రాంతాల్లో తమా వాహనాలు పార్కింగ్ చేసుకొని వేడుకలకు రావాలి అన్ని ప్రకటనా విడుదలా చేశారు.
ఆహ్వానితులు సులువుగా గుర్తించడం కోసం వారి వాహనాల విండ్స్క్రీన్కు ఎడమ వైపున వారి క్యాంపు పాస్లను చూపించాలి . స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత, బంజారా దర్వాజా నుండి ఆహ్వానితులు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఏడు సమాధుల నుండి గోల్కొండ కోట వైపు వచ్చే సాధారణ ప్రజలను గోల్ఫ్ క్లబ్, జమాలి దర్వాజా నుండి దారి మళ్లిస్తారు.