మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది .వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న త్రిష 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా త్రిష మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించింది. ఈ సినిమా త్రిషకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకొవాలి.ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందానికి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు.
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దళపతి విజయ్ లియో సినిమా గురించే. త్రిష, విజయ్ జోడీగాకి తమిళ నట మంది క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తోన్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది త్రిష.