పెళ్లిళ్లపై హాట్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..
మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు వరుణ్ తేజ్. ఈ వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించార. ఇక చేతిలో గన్ పట్టుకొని హల్చల్ చేస్తూ సినిమా యూనిట్ ను బుల్లెట్స్ వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ ని ఆమె అడిగిన ఒక ప్రశ్న అందరిని ఆకట్టుకుంటుంది . త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్ ను ఈ విధంగా ఒక ప్రశ్న కూడా అడిగింది. రామ్ చరణ్ , అల్లు అర్జున్ లలో పెళ్లయ్యాక ఎవరు బాగా మారిపోయారు అని అడగగా.. ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలో వరుణ్ తేజ్ కి మొదట అర్థం కాలేదు.
![బన్నీ, చెర్రీ పెళ్లిళ్లపై హాట్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..! 2 బన్నీ, చెర్రీ పెళ్లిళ్లపై హాట్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-23T114453.876.jpg)
ఇక నిజానికి ఈ ప్రశ్నను వాళ్లనే అడగాలి అని చెప్పిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత పెళ్లయ్యాక ఎవరైనా సరే మారిపోవాల్సిందే అని అంటూ ఏం చేసినా నోరు మూసుకొని ఉండాల్సిందే అంటూ హాట్ కామెంట్ చేశారు వరుణ్ తేజ్. దీన్ని బట్టి చూస్తే తాను కూడా పెళ్లయిన తర్వాత సైలెంట్ కావాల్సిందే అన్నట్టుగా చెప్పారు అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇకపోతే దర్శకుడు అనిల్ రావిపూడి ని ఉద్దేశిస్తూ ఎఫ్2 మూవీ లో కూడా మాకు ఇదే నేర్పించాడు.. పెళ్లయ్యాక మారిపోవడం మంచిదే అన్నట్లు వరుణ్ తేజ్ తెలియచేసారు .
అదే సమయంలో పరోక్షంగా రామ్ చరణ్ , అల్లు అర్జున్ కూడా తమ భార్యలు వచ్చాక చాలా మారిపోయారు అన్నట్లు తెలిపారు. ఇక వరుణ్ తేజ్ సమాధానం తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు . ఇక మరో ప్రశ్నగా లావణ్య త్రిపాఠి ,నిహారిక లు ఇద్దరి నుండి ఒకేసారి అర్జెంటుగా ఫోన్ చేయండి మెసేజ్ చేస్తే ఎవరికి ముందుగా కాల్ చేస్తావు అని అడగగా .. దానికి తడుముకోకుండా నిహారిక అని చెప్పేసాడు . తను చిన్నపిల్ల కదా అందుకే ముందుగా తనకే ఫోన్ చేస్తాను అని అంటూ తెలిపారు.