టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్ర మొదలు పెట్టానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కుప్పం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ లోకేష్ పాదయాత్రలు దాడులు చేయాలని వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సప్ గ్రూపులలో విస్తృతంగా సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఇక లోకేష్ పాదయాత్ర చేసే సమయంలో ఎక్కడ ఎలా దాడులు చేయాలనేది కూడా విహాత్మకంగా వైసీపీ అధిష్టానం నుంచి కార్యకర్తలకి సందేశం వెళ్తున్నట్లుగా టీడీపీ అనుమానిస్తుంది. పాదయాత్రలో హింసాత్మక పరిస్థితులు సృష్టించి చట్టాన్ని ఉపయోగించుకుని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
దీనిని బలంగా తిప్పికొట్టేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని వైసీపీ అధిష్టానం భావించడానికి కారణం ఉంది. లోకేష్ పాదయాత్రలో ప్రధానంగా తమ పార్టీని చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎవరైతే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారో ఆ నాయకుల నియోజకవర్గంలో మరింత విస్తృతంగా పర్యటించి ప్రజలను ప్రభావితం చేసి ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. నగరి, గుడివాడ, పీలేరు, పుంగనూరు, గన్నవరం, సత్తెనపల్లి నియోజకవర్గాలలో విస్తృతంగా పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర కచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని వైసీపీ బలంగా నమ్ముతుంది.
లోకేష్ పాదయాత్ర తో పాటు, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కూడా చేపట్టనున్న నేపథ్యంలో వారు విస్తృతంగా వైసీపీపై వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ముందుగానే పసిగట్టిన జగన్ టీమ్ లోకేష్ యాత్రను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చాలామంది వైసీపీ నాయకులు నారా లోకేష్ యాత్ర విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, పాదయాత్ర జరిగితే ఖచ్చితంగా తమ ఓడిపోతామని విషయాన్ని అధిష్టానం ముందు ఉంచడంతో వారు వ్యూహాత్మకంగా ఈ యాత్రను అడ్డుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.