అవును.. వాళ్లిద్దరూ విడిపోయారు. నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారు. వాళ్లకు ఈమధ్యే కోర్టు అధికారికంగా విడాకులను మంజూరు చేసింది.
చాన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడిపోయింది. అతనితో విడాకుల ప్రక్రియ తాజాగా పూర్తయింది. కోర్టు ఈ మధ్యే ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అయితే వీళ్లు విడిపోవడానికి కారణమేంటో తెలియలేదు. కొన్నాళ్లుగా నిహారిక, చైతన్య మధ్య మనస్పర్దలు రావడంతో వీళ్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
![అవును.. వాళ్లిద్దరూ విడిపోయారు.. నిహారిక, చైతన్య విడాకులు 2 అవును.. వాళ్లిద్దరూ విడిపోయారు.. నిహారిక, చైతన్య విడాకులు](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-04T172415.392.jpg)
నిహారిక, చైతన్య విడాకులు :
తాజాగా అధికారికంగా విడాకులతో వీళ్ల రెండేళ్ల పెళ్లి బంధం ముగిసిపోయింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో గత కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ మధ్య నిహారిక హైదరాబాద్లో తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆఫీస్ను ఓపెన్ చేసింది. ఇటీవల ఈ ఆఫీస్ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించలేదు. సోలోగా నిహారిక అన్ని పనులు చక్కబెడుతూ కనిపించింది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక.. యాంకర్గా, హీరోయిన్గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 2020 డిసెంబరులో టెక్ అఫిషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఉదయ్పుర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.