ఏపీలో మూడు రాజధానుల ఎజెండాతో వైసీపీ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు అన్ని కూడా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ముఖ్యమంత్రి జగన్ టీమ్ మాత్రం డానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది. అయితే ఇప్పటికే మంత్రులు అందరూ కూడా విశాఖ రాజధాని అని త్వరలో వైజాగ్ నుంచి పరిపాలన మొదలుపెడతామని చెబుతున్నారు. అయితే ఈ మాటలు ఎప్పుడూ చెప్పేవే అని ప్రతిపక్షాలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.
కాని తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో త్వరలో విశాఖ రాజధానిగా పరిపాలన స్టార్ట్ చేస్తామని, తాను కూడా అక్కడే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి రావాలని విజ్ఞప్తి చేశారు. నేరుగా ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన మొదలుపెడతానని చెప్పడంతో మేగ్జిమమ్ వైసీపీ అధిష్టానం విశాఖని రాజధానిగా నిర్ణయం తీసుకున్నారని అర్ధం అవుతుంది. అయితే ఓ వైపు మూడు రాజధానులు అంటూ జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తూ మరో వైపు విశాఖ రాజధాని అని కేంద్రస్థాయిలో చెప్పడం ద్వారా ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వస్తుంది.
అమరావతి రాజధానిని వైసీపీ పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శలు చేస్తున్నారు. అలాగే కర్నూలు లో జ్యుడీషియల్ క్యాపిటల్ అని చెబుతున్న అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయి. మిగిలిన పరిపాలన అంతా కూడా విశాఖ నుంచే జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఏపీకి విశాఖని రాజధానిగా మార్చే దిశగానే జగన్ అడుగులు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం ప్రజలని నమ్మించదానికి మూడు రాజధానులు అనే నినాదాన్ని జనంలోకి పంపిస్తున్నారు అని భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఇప్పుడు