YS Jagan: ఏపీలో విశాఖపట్నం ప్రస్తుతం అతి పెద్ద నగరంగా ఉండటంతో పాటు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వనగరంగా ఉందని చెప్పాలి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాలలో విశాఖపట్నం ఉంది. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నం బ్రాండ్ ని దేశంలో ఏ ఒక్క నాయకుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు. విశాఖపట్నం ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్న ఉత్తరాంధ్రని వెనుకబడిన ప్రాంతంగానే చూపిస్తూ విశాఖపట్నం బ్రాండ్ వేల్యూ దెబ్బతీసే ప్రయత్నం ఇంతకాలం జరిగింది. అయితే వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే ముఖ్యమంత్రి జగన్ దృష్టి విశాఖపట్నంపై పడింది.
ముఖ్యమంత్రి జగన్ ఒక నాయకుడిగానే కాకుండా ఒక వ్యాపారిగా కూడా విశాఖపట్నం వేల్యూని గుర్తించారు. ఇలాంటి నగరాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించారు. అలాగే ఏపీకి పెర్ఫెక్ట్ క్యాపిటల్ విశాఖపట్నం మాత్రమే అని డిసైడ్ అయ్యారు. అయితే మూడు ప్రాంతాలకి నష్టం జరగకుండా విశాఖని పరిపాలక రాజధానిగా ఎనౌన్స్ చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం విశాఖపట్నం బ్రాండ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పాలి.
ఉత్తరాంద్రని కేవలం వలస కార్మికుల ప్రాంతంగా మాత్రమే గుర్తించి వెనుకబడిన జిల్లాలుగా విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరాన్ని వెనక్కి నెట్టేశారు. నిజానికి అత్యంత ప్రకృతి వనరులు, అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉత్తరాంద్రలో తీరప్రాంతంలో ఉన్నాయి. వ్యాపారానికి కావాల్సిన నాలుగు ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు ఉత్తరాంద్రలో ఉన్నాయి. దీనిని జగన్ కరెక్ట్ గా గుర్తించి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకి విశాఖ బ్రాండ్ ని పరిచయం చేశారు. దీంతో ఏకంగా 13.05 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో మెజారిటీగా విశాఖపట్నంలో పెట్టడానికి కంపెనీలు సిద్ధం అయ్యాయని చెప్పాలి.