ఏపీ రాజకీయాలలో రోజురోజుకీ ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీపై ఓవైపు ప్రజలలో మరోవైపు పార్టీ నాయకులలో కూడా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అయితే ఇప్పటికే కిందిస్థాయి నాయకుల్లో అధిష్టాన వైఖరిపై అసంతృప్తి నెలకొని ఉంది.
ఒక సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాయకులు ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు నిలదీస్తున్నారు. దీనిని తట్టుకోలేక నాయకులు బహిరంగంగానే ఆసనం వ్యక్తం చేస్తున్నారు. తాతగా నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వైసిపి అధిష్టానం తన విషయంలో అవలంబిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ టాపింగ్ చేస్తూ తనని అనుమానిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పార్టీలో పని చేయలేనని కూడా తేల్చేశారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసిపి అధిష్టానం దూరం చేసుకుంది. ఒకే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా అధిష్టాన తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వైఎస్ జగన్ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఎన్నడూ లేని విధంగా పార్టీలోని సీనియర్ నాయకులతో అత్యవసరంగా ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి లీడర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ భేటీలో నెల్లూరులో రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ విధానాల పైన కూడా జగన్ సీనియర్ నాయకులకు తెలియజేయడంతో పాటు వారి నుంచి ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో మరింత మంది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా తమ స్వరాన్ని వినిపించే అవకాశం ఉందని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసమ్మతి నాయకులు ఎవరనేది గుర్తించే పనిలో వైసిపి అధిష్టానం కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.