YS Jagan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ బలం గత ఎన్నికలలో కంటే ప్రస్తుతం మరింత పెరిగిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దానికి కారణం 2019 ఎన్నికలలో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయంతో ప్రజలు పట్టం కట్టారు. అయితే ఈ ఈ ఐదేళ్లలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. ప్రతి ఇంకో ఏదో ఒక పథకంతో ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సంక్షేమ పథకాలతో ప్రజల ఆర్ధిక వృద్ధి కూడా పెరిగిందిఅని గణాంకాలు చెబుతున్నాయి.
కొనుగోళ్ల శక్తి కూడా గణనీయంగా పెరిగింది. తెలంగాణ కంటే ఏపీలోనే జఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఉండటం కూడా దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎంత సేపు వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై బురదజల్లుతూ దానితో లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే టీడీపీకి తోడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా జగన్ పై విపరీతమైన ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు. సంక్షేమం జరుగుతుందని తెలిసిన కూడా దానిపై ప్రజల దృష్టి ఉండకుండా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్నికల ముందు వైసీపీ పార్టీ నుంచి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం వినిపిస్తుంది. టీడీపీ పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తుంది. అయితే ఇలా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న దొంగకోళ్ళ లాంటి నాయకులని ముందుగానే ఎలిమినేట్ చేయడానికి ముఖ్యమంత్రి జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ బాద్యతని ఐ ప్యాక్ టీమ్ కి అప్పగించారు. ఎవరైనా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ వేరొకని ఇన్ చార్జ్ గా నియమించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.