YS Jagan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలతో ప్రతి ఏడాది, ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ది చేకూరేలా చేస్తున్న జగన్ ఇప్పుడు ఉద్యోగ, ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ని గ్రాండ్ గా నిర్వహించి ఏకంగా 13 లక్షల కోట్లకి పైగా పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయ్యాయి.
అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా కంపెనీలు ఎంవోయూలు చేసుకొని పెట్టుబడులు పెడతామని ముందుకి వచ్చాయి. అయితే వారిలో చాలా మంది పరిశ్రమల స్థాపనకి ముందుకి రాలేదు. అయితే ఈ సారి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. కచ్చితంగా పెట్టుబడులని ఏ స్థాయిలో అయితే ఎంవోయూ జరిగాయో అందులో మెజారిటీ పరిశ్రమలకి గ్రౌండింగ్ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వారికి కావాల్సిన భూములని సమకూర్చడంతో పాటు పరిశ్రమలకి సంబందించిన పునాదులు కూడా పడేలా చూడాలని అనుకుంటున్నారు. ఇలా పరిశ్రమల స్థాపనకి సంబంధించి పునాదులు పడితే తీసుకొచ్చిన పెట్టుబడులు ఇవి అని ప్రజలకి చూపించుకునే అవకాశం లభిస్తుంది అని అంచనా వేస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలలో చాలా వరకు ఇండియాకి చెందినవే కావడంతో వారికి కావాల్సిన అనుమతులు సమకూర్చాలని మంత్రులకి దిశా నిర్దేశ్యం చేసినట్లు టాక్. ముఖ్యంగా విశాఖలో మెజారిటీ పరిశ్రమల స్థాపనకి భూములు కేటాయించాలని సూచిస్తున్నారు.