ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైసీపీలో ఆసమ్మతి నాయకులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పటికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యే వరకు వైసీపీ అధిష్టానంపై ఎప్పటికప్పుడు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం సేవలు చేసిన కనీసం పార్టీలో సముచిత స్థానం కూడా ఇవ్వడం లేదనే కోపం చాలామందికి ఉంది. ఆ కోపాన్ని వారు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి అసంతృప్తి నేతలు అందరిని కూడా వైసీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం మరోవైపు నుంచి మొదలు పెడుతుంది. రాయలసీమ పల్నాడు జిల్లాలో చాలామంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమ నియోజకవర్గాల్లో కనీసం అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయడం లేదని కోపం చాలా మందిలో ఉంది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకుని వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకుంటే ఇప్పుడు కనీసం పట్టించుకున్న పాపన కూడా పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగానే వైసీపీ అధిష్టానం చేశారు. గత ఎన్నికల్లో జెండా పట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా ఈసారి పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అసమ్మతి స్వరం ఉత్తరాంధ్రలో కూడా మొదలైంది.
శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో క్రింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే కనీసం తమని పట్టించుకోవడంలేదని కోపం వారిలో ఉంది. ఎంపీటీసీ, జడ్పిటిసి స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేలు మంత్రులపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టి కాంట్రాక్టులు వస్తే సంపాదించుకోవచ్చు అని భావించిన వారందరికీ కూడా జగన్ మొండి చేయి చూపించారు. అయితే ఇప్పుడు వారందరూ కూడా అప్పుల్లో మునిగిపోయి అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది కచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ, జనసేనకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చాలామంది వైసీపీ నుంచి నాయకులు జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభించే సమయంలో ఈ చేరికలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.