బిగ్ బాస్ సీజన్ లో మొదటి సరిగా వారాంతంలో కాకుండా మధ్యలోనే ఒక కంటిస్టెంట్ ని ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటిస్టెంట్ ఫైనల్ రౌండ్ కి ఉన్నారు. వీరి ఆరుగుని ఫైనల్ కి తీసుకెళ్లి అక్కడ టాప్ 2ని ఫిల్టర్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా మొదటి సారిగా శుక్రవారం ఒకరిని హౌస్ నుంచి బిగ్ బాస్ బయటకి పంపించేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టీమ్ సభ్యులని బిగ్ బాస్ అడగగా అందరూ కూడా కీర్తి ఎలిమినేట్ అవుతుందని చెప్పారు. అయితే అనూహ్యంగా శ్రీసత్యని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ పరంగా ప్రస్తుతం శ్రీసత్యకి తక్కువ ఓటింగ్ ఉండటంతో ఆమెని ఎలిమినేట్ చేసి బయటకి పంపించారు.
ఇక శ్రీసత్య హౌస్ ని వీడుతున్నప్పుడు రేవంత్, శ్రీహాన్ కాస్తా ఎమోషనల్ అయ్యారు. హౌస్ లో తన ఎమోషన్ ని ఫస్ట్ నుంచి అర్ధం చేసుకున్నది శ్రీసత్య ఒక్కరే అని రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. అలాగే హౌస్ లో తనకి కనెక్ట్ అయిన వ్యక్తి శ్రీసత్య అంటూ శ్రీహాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇక శ్రీసత్య కూడా శ్రీహాన్, రేవంత్ ని హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న నేపధ్యంలో అంత వరకు శ్రీసత్య బిగ్ బాస్ అండర్ టేకింగ్ లో ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొత్తానికి బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అటు హౌస్ లో ఉన్నవారితో పాటు ఆడియన్స్ కి కూడా షాక్ కి గురిచేసింది అని చెప్పాలి. ఇక విన్నర్ రేసులో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆదిరెడ్డి విన్నర్ అయితే మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో అదొక సంచలనంగా మారే అవకాశం ఉందని చెప్పాలి.