పౌష్టికాహారం కోసం చాలా మంది ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. శాకాహారంలో అన్నిటికంటే ఆకుకూరలు ఎంతో శ్రేయస్కరం అని కూడా డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకుకూరలు తీసుకోమని సలహా ఇస్తారు. క్రమం తప్పకుండా ఆకుకూరలు తీసుకుంటే శరీరంలో ఫ్యాట్ తగ్గడమే కాకుండా పోషకాహార లోపం కూడా తగ్గుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే ఆకుకూరలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ శక్తిని మెరుగుపరచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఇందులో ఉంటాయి. అయితే ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమమే అయిన వర్షాకాలంలో మాత్రం వీలైనంత వరకు ఆకు కూరలని తీసుకోకుండా ఉండటమే ఉత్తమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో తీసుకునే ఆహారం వీలైనంత వరకు తక్కువ సామర్ధ్యం కలిగి ఉన్నవి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆకు కూరలలో నీరు ఎక్కువగా ఉండటం వలన వర్షాకాలంలో వీటిని తీసుకుంటే జీర్ణశక్తి మందగిస్తుంది. అలాగే వర్షాకాలంలో ఆకులపై క్రిమికీటకాలు ఎక్కువగా వ్యాపించి ఉంటాయి. కంటికి కనిపించని హానికర సూక్ష్మజీవులు, బాక్టీరియాలు ఆకులపై వర్షాకాలంలో ఎక్కువగా తిష్టవేసి ఉంటాయి. ఈ సీజన్ లో అవి సంతాన వృద్ధి కోసం ఆకులని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఈ కారణంగా వర్షాకాలంలో వీలైనంత వరకు ఆకుకూరలని దూరం పెట్టడమే ఉత్తమమైన మార్గం అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒక వేళ తినాల్సి వస్తే కనీసం ఒక అరగంట సమయం ఆకులని ఉడికించి తరువాత కూర వండుకొని తింటే ఎలాంటి బాక్టీరియాల ప్రభావం లేకుండా అందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతున్నారు.
వీటి స్థానంలో ఎక్కువగా కాయగూరలు, చట్నీలు తరుచుగా తీసుఉంటే మంచింది. అలాగే పెరుగు, మజ్జిక పూర్తిగా తగ్గిస్తే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అలాగే వర్షాకాలంలో పరిశుభ్రమైన నీటిని మాత్రమె తాగాలి. అలాగే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఫ్రెష్ ఫుడ్ మాత్రమే వీలైనంత వరకు తీసుకోవాలి. అలాగే ఆహార పదార్ధాలని నిల్వ ఉంచిన కచ్చితంగా వేడి చేసుకొని మళ్ళీ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.