ప్రస్తుతం జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు.అందుకే అన్ని రంగాలలోని బిజినెస్ హెడ్ లు కొత్త ఆలోచనల కోసం తలలు బాదుకుంటున్నారు.ఇలాంటి సమయంలో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ గుండ్రంగా ఉండే ఇడ్లీలను పుల్ల ఐస్ రూపంలో తయారు చేసి జనాలని ఆకర్షిస్తుంది.ఈ రెస్టారెంట్ కి వచ్చిన వారంతా ఆ ఇడ్లీలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
ఇడ్లీ పిండికి ఐస్క్రీమ్ పుల్లను జోడించి వాటిని పుల్ల ఐస్ రూపంలో తయారు చేశారు.ఈ ఐడియా బాగా వర్క్ ఔట్ అవ్వడంతో ప్రస్తుతం ఆ రెస్టారెంట్ కి మంచి గిరాకీ పెరిగింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పుల్ల ఐస్ ఇడ్లీ పై మీరు కూడా ఓ లుక్కేయండి