Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో కుటుంబ సభ్యులు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి లాస్య వచ్చి అందరూ ఒకటయ్యారు అని తను కూడా కలవడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆమెను చూడటంతో అందరూ సైలెంట్ అవుతారు. ఇక లాస్య ఇలా చూడడానికి చాలా సంతోషంగా ఉంది దిష్టి తగిలేలా ఉంది మీరు దిష్టి తీయండి అత్తయ్య అంటూ అని చెబుతుంది లాస్య. వెంటనే ప్రేమ్ కలగచేసుకుని వెటకారంగా కౌంటర్ వేస్తాడు.
దాంతో లాస్యకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత తన అత్తయ్య కోసం టాబ్లెట్లు ఇస్తాను అవి చేస్తాను ఇవి చేస్తాను అనడంతో కుటుంబ సభ్యులు అంటారు. ఆ తర్వాత పరంధామయ్య తన చేతిలో ఉన్న పండుని పడేయడంతో లాస్య తిరిగి ఇస్తుంది. అది పాడయిందని నేనే పడేసాను అని పరంధామయ్య అంటాడు. బాగానే ఉంది కదా అని అనటంతో వెంటనే పరంధామయ్య లాస్యను ఉద్దేశించి పైకి బాగున్నవన్నీ లోపల బాగోవు అని డైలాగు కొడతాడు.
ఇక అనసూయ కూడా లాస్య ముఖం చూస్తూ కోపంగా కనిపిస్తుంది. అప్పుడే తులసి ఫోన్ చేయటంతో అనసూయ సంతోషంగా మాట్లాడుతుంది. అది చూసి లాస్య జీర్ణించుకోలేక పోతుంది. నిన్ననే గొడవపడ్డారు అంతలోనే కలిశారు అని అనుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్లంతా తులసి తో ఒక కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాము అని మాట్లాడుతూ ఉంటారు. మధ్యలో సరదాగా డైలాగులు కొడుతూ ఉంటారు.
ఇక పరంధామయ్య కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అనసూయ ఇంటికి రమ్మని అనటంతో ఆఫీసులో పని ఉంది తర్వాత కు వస్తాను అని అంటుంది. ఆ తర్వాత తులసి సంతోషంగా ఫీల్ అవుతుంది. అందరూ సంతోషమే అని అనుకుంటుంది. ఇక లాస్య సంగతి తన భర్త చూసుకుంటాడు అని అనుకుంటుంది.
అక్కడున్న వాళ్ళందరూ లాస్యను పట్టించుకోకపోవడంతో లాస్య అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు హనీ తులసి ని గుర్తుకు చేసుకుంటుంది. ఆంటీ తో మాట్లాడక చాలా రోజులు అయింది అని అంటుంది. అప్పుడే అక్కడికి తులసి రావటంతో తన దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ హనీ చేత తులసికి శాలరీ ఇప్పిస్తాడు.
ఆ తర్వాత హానిని అక్కడ నుంచి పంపించగా మళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.ఇక తులసి ఆడవాళ్ళ గొప్పదనం గురించి చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా బాలు ఒక ఛాలెంజ్ కూడా మొదలుపెడతారు. ఇక నందు తండ్రికి సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంటి కోడళ్ళు వచ్చి ఇంట్లో బాధ్యతలు గురించి చెబుతుంటారు. నెల సామాన్ల గురించి రాసుకొని రావటంతో వెంటనే లాస్య ఆ చీటీ లాక్కుంటుంది.
ఈ బాధ్యతలన్నీ నాది అని అంటుంది లాస్య. ఆ చీటీ ఇస్తే నందు సరుకులు తెస్తాడు అని పరంధామయ్య అనటంతో ఇక్కడి నుంచి తెస్తాడు జాబు లేదు అంటూ మాట్లాడుతుంది. దాంతో నందు చిరాకు పడుతుంటాడు. ఇక లాస్య తులసిని కూడా లాగుతుంది. అంతేకాకుండా ఆ చీటీలో ఉన్న వస్తువులను చూసి ఇంత ఎందుకు అని అంటుంది.
Intinti Gruhalakshmi:
వెంటనే అభి ఆ చీటీ లాక్కొని మా నాన్న బాధ్యత లేకుంటే ఆయన కొడుకుల బాధ్యత మాది ఉంటుంది అని అంటారు. అలా కాసేపు అక్కడ మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత నందు వాళ్లకి కూడా బాధ్యతలు తెలియాలి కదా వాళ్ళనే సరుకులు తెమ్మని అంటాడు. అది చూసి అనసూయ సంతోషపడుతుంది. పరంధామయ్య తన వాళ్ళను దగ్గరికి తీసుకుంటాడు