సౌర్య చీర కట్టుకుని కుందనపు బొమ్మలా తయారవుతుంది. అది చూసి చీరలో పదహారణాల తెలుగమ్మాయిలా ఉన్నావు అని పొగడ్తలతో ముంచెత్తుతాడు ఆనందరావు. అలా అందంగా తయారవ్వకా.. ఆ డ్రెస్సులు, ఆటో ఏంట్రా అని అడుగుతాడు. దాంతో చిన్నప్పుడు వారణాసి వచ్చిన కథని చెబుతుంది సౌర్య. అది విని వారణాసిని పంపింది తనేనని చెబుతాడు ఆనందరావు. అనంతరం ప్రేమ్ దిగులుకు కారణం ఏంటని అడుగుతుంటాడు నిరుపమ్. అప్పుడే నిరుపమ్కి హిమ కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 15 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
నిరుపమ్కి కాల్ చేసిన హిమ గుడికి వెళతున్నామని చెబుతుంది. గుడి నుంచి రాగానే కాల్ చేయి నీతో మాట్లాడాలని అని ఫోన్ పెట్టేస్తాడు. అనంతరం ఎందుకురా వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు ప్రేమ్ని. దానికి.. ‘‘హిమ పెళ్లి ఆపమంటోంది కానీ.. తన మనసులో నేను ఉన్నానో లేదో చెప్పట్లేదు.. ఇప్పుడు ఎలా’ అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. అనంతరం.. ‘నిరుపమ్.. అసలు ఒక మనిషి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలిరా’ అని అడుగుతాడు అమాయకంగా. ‘అస్సలు విషయం పూర్తిగా చెబితే అప్పుడు నేనేదైనా సలహా ఇవ్వగలను.. ఇలాంటి ప్రశ్నలకి’ అంటాడు నిరుపమ్. నిజాన్ని ఎలాగైనా అమ్మనాన్నకి చెప్పాలనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.
మరోవైపు సత్యం, స్వప్న గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ‘షాపింగ్కి తీసుకెళ్లి అమ్మనాన్నకి ఇష్టమైనవన్నీ కొనివ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది స్వప్న. అది మంచి ఆలోచనని సమర్థిస్తాడు సత్యం. అనంతరం అక్కడికి ప్రేమ్ వస్తాడు. అతన్ని చూసి.. ‘వీడు ఏదో టెన్షన్లో ఉన్నట్లు ఉన్నాడు. అది ముఖంలోనే కనిపిస్తుంది’ అని స్వప్నతో అంటాడు సత్యం. కానీ.. శోభ పరిణామం వల్ల చాలా అలిసిపోయాను. ఇప్పడు ఎవరి సమస్యల గురించి ఆలోచించే ఓపిక లేదని చెబుతుంది స్వప్న. అయినా.. ప్రేమ్ ఓ ఐదు నిమిషాల టైమ్ ఇస్తే నా బాధ చెబుతానంటాడు ప్రేమ్. అయినా వినకుండా.. ‘నీకేం సమస్యలు ఉంటాయిరా. ఉంటే నిరుపమ్ పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం’ అని భర్తతో కలిసి గుడికి వెళ్లిపోతుంది స్వప్న.
అక్కడ గుడికి వెళ్లాక చాలా భక్తిగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. సౌందర్య.. ‘మనవరాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉండాలి. నిరుపమ్, హిమ పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి’ అని కోరుకుంటుంది. సౌర్య మాత్రం.. ‘నువ్వు దేవుడివి కదా.. నా కోరికేంటో నీకు తెలుసు.. నాది అత్యాశే కావచ్చు’ అనుకుంటుంది మనసులో. సౌర్య కోరిక దీప, కార్తీక్ బతికి రావాలనే కాబట్టి.. మరోసారి దీప కోమాలో ఉన్న సీన్ చూపిస్తారు డైరెక్టర్. ఇక హిమ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత.. సౌర్య దగ్గరకు వచ్చి.. ‘నీతో మాట్లాడాలి’ అంటుంది. ‘ప్రతి సారీ ఇదో నాటకం అయిపోతుంది.. పదా ఏం మాట్లాడాలో మాట్లాడుదువు గానీ..’ అంటూ సౌర్య.. హిమ చేయి పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్తుంది. సౌందర్య ,ఆనందరావు, స్వప్న, సత్యల కంగారు పడుతూ.. వాళ్ల వెనుకే సౌర్య ఆగవే అంటూ వెళ్తారు.
కోపంగా హిమని పక్కకు లాక్కెళ్లిన సౌర్య.. ఇప్పుడు చెప్పు అంటుంది. అప్పుడు లోయలోకి పడిపోతున్నప్పుడు తనని కిందకి నెట్టేశారని.. అంతేకాకుండా.. సౌర్యని జాగ్రత్తగా చూసుకోమని అమ్మనాన్న చెప్పారని హిమ చెబుతుంది. అది అమ్మనాన్న వచ్చి చెబితే కానీ నమ్మనని బెట్టు చేస్తుంది సౌర్య. చనిపోయిన వారు ఎలా వస్తారని అందరూ అంటారు. అప్పుడే.. కార్తీక్, దీప బతికున్నట్లు చెబుతాడు అక్కడికి వచ్చిన వారణాసి. సరిగ్గా అప్పుడే యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఊహించుకుంటూ.. ‘డాక్టర్ బాబు’ అంటూ కోమాలోంచి బయటికి వస్తుంది కోమాలో ఉన్నా దీప.
అది చూసిన నర్సుల పరెగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ని తీసుకొస్తుంది. అక్కడికి వచ్చిన డాక్టర్.. ‘దీపని కంగారు పడొద్దు. నువ్వు చావుని జయించావు’ అని చెబుతూ ట్రిట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే నా డాక్టర్ బాబు ఎక్కడా అంటూ పరుగెత్తుతూ ఉంటుంది దీప. అది చూసిన డాక్టర్ షాక్ అవుతూ నిన్ను ఒక్కదాన్నే ఇక్కడ జాయిన్ చేశారని, అప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు చెబుతాడు డాక్టర్. దాంతో డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తూ.. ఏడుచుకుంటూ హాస్పిటల్ మొత్తం తిరుగుతుంటుంది దీప. అప్పుడే హిమ, సౌర్య గుర్తొస్తారు దీపకి
దాంతో.. చిన్నప్పటి సౌర్య తెరమీదకి వస్తుంది. అమ్మనాన్న కావాలంటూ పిన్ని, బాబాయ్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది సౌర్య. అప్పుడు మేము వాళ్లని తీసుకురాలేము కానీ.. నిన్ను అంత ప్రేమగా చూసుకోగలమని ఓదారుస్తుంటాడు బాబాయ్. అక్కడ దీప.. ఇక్కడ సౌర్య ఏడుస్తూ ఉంటారు. తరువాయి భాగం అంటూ.. దీప డాక్టర్ బాబు ఎక్కడ అని ఏడుస్తూ ఉంటుంది. అతను ఎవరని డాక్టర్ అడిగితే తన భర్త అని చెబుతుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.